ఓం శ్రీ సాయిరాం
ఇకనైన మేలుకోరా
పల్లవి
మనుషులంటే... విలువలేదు
ఏమిటీ లోకము...
మంచి వీడి చెడును చేరి
చీకటైపోయెను...
ముందడుగు వేస్తె నుయ్యి...
వెనకడుగు వేస్తె గొయ్యి...
ఎటువైపు చూడు మటుమాయలేను
ఇకనైన మేలుకోరా...
|| మనుషులంటే||
చరణం 1
మేకతోలునే కప్పుకొని
పులిని లోపలే దాచుకొని
మంచితనపు టోపీ వేసి
నిలువు దోపిడీ చేస్తారు
మాటతోనె యేమారుస్తూ
మంచి మనిషిలా నటియిస్తూ
గాలి మేడ పైకెక్కించి
మట్టిలోకి తోసేస్తారు
మునుపటిలా మనుషులు లేరిపుడు
అసలుందో లేదో మనసిపుడు
మర మనుషులైతె మమకారమింక
వసివాడి రాలిపోదా...
|| మనుషులంటే||
చరణం 2
వాడుకునే ఒక వస్తువుగా
మనిషిని భావన చేస్తారు
అవసరాలనే తీర్చుకుని
అవతల పారేస్తారు
అభిమానం మనిషికి ఆభరణం
అది వున్న వారికే అవమానం
సమయాన్ని బట్టి సమయోచితంగ
అడుగేస్తు సాగిపోరా
|| మనుషులంటే||
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు