ఓం శ్రీ సాయిరాం
కళ్యాణి మణిద్వీప మందున ఉదయించే తొలిరాగమై
తేది : 23-05-2016
పల్లవి :
సంగీతం శ్రుతిలయలుగా సాహిత్యం కృతి పలికెనే
లయతోడై రాగమ్ము రసమయ భావాన్నే పలికించగా
||సంగీతం||
చరణం :1
నాధంలో వెలిసింది రాగం స్వరగతులే ధ్వనియించగా
నాట్యంలో విరిసింది తాలం తాండవము లాస్యమ్ముగా
ఊహల్లో జనియించి భావం అక్షరమే ప్రతిరూపమవగా
గానంలో రసరమ్య గీతం హృదయాన్నే కదిలించలేదా
సంగీతం స్వరమేలే... సాహిత్యం పదమేలే...
చరణాలే జతచేరి పల్లవి గేయంలో జ్ఞానమ్ము తెలుపగ
||సంగీతం||
చరణం :2
కళ్యాణి మణిద్వీపమందున ఉదయించే తొలిరాగమై
ప్రతిరాగం కళ్యాణి నుండీ జతవీడి జనియించగా
ఓంకారం ప్రధమాక్షరముగా పలికేనే పాపాయిలే
ప్రతి మంత్రం ఉచ్ఛారమందున ప్రాణమ్మే ఓంకారమవగ
వేదాలే నాధాలై...ఓంకారం బీజాలై...
కుండలినీ జాగృతిని చేయుచు ఓంకారం సాగింది నాలో
||సంగీతం||