ఓం శ్రీ సాయిరాం
అందమైన కందాలు
కం. వందనము తెలుగు తల్లీ
అందరమూ జేతులెత్తి దండము సేయన్
కందమునేమని చెప్పుదు
సుందరముగ పాదమమరె సొగసుల తోడన్
కం. జయము జయము గురువులకును
దయతో భారతి వచింప పలికిన
కందం
లయ జేతును మీ తోడుగ
నయమే నే మేలుకొంటి
నలుగురితోడన్
కం. కలగా మిగిలిన కందము
జల జలమని వలచి వచ్చి ఝరిలో జేరెన్
ఇలపై నిలవని మనసున
తొలగాలిక తెరలమబ్బు తరుణంబిదియే
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు