ఓం శ్రీ సాయిరాం
లాస్య గీతం
పల్లవి
అరుణబింబ మంబరాన
అతిశయంగ అలసి సొలసి
సంధ్య వేళ సొమ్మసిల్లి
ఛాయ చెంత సేదదీరి
కిరణమొకటి పట్టుదప్పి జారిందంట
శ్రీ దివ్య దోసిట్లో చేరిందంట
||అరుణబింబ మంబరాన||
చరణం 1
స్వాగతాల భంగిమలో సంధ్యకాల వందనాన
సూర్యుడినే హారతిగా ఇస్తూ వుంటే
కృష్ణమ్మ హొయలన్నీ వేళ
తనలోనే పొదిగింది బాల
కెరటాలను తన కాలికి ముడివేసింది
భరతం తన పదమందున ప్రభవించింది
తా...తై... తక... ఝం... ఝం... ఝం...
తా...తై... తక... ఝం... ఝం... ఝం...
||అరుణబింబ మంబరాన||
చరణం 2
అభినయించు అంగాంగం రసవిధ్యా సంగమమై
లావణ్యం లాస్యంతో లయమౌతుంటే
కృష్ణమ్మా ఒడిలోనీ వేళ
తాండవమే చేసిందీ బాల
హృదయం పరవశమై తను నర్తిస్తుంటే
చరణం శ్రుతి లయలై నది రవళిస్తుంటే
గీతం... ధ్వనియించింది...
నాలో... జనియించింది...
||అరుణబింబ మంబరాన||
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు