ఓం శ్రీ సాయిరాం
మదిగీతం
పల్లవి
మనసే కాగితం ప్రేమే కారకం
నీతోడై నడవాలి నా పాళీ
ఇది మదికావ్యం మధుగీతం కావాలి
మౌనంగా ఎదలోనే సాగాలి
చరణం:1
నాలో స్పందన నీవైతే
ఉదయించే ఊహలకు ఊపిరివే
ఊగించేవిలా మది ఉయ్యాలలా
నిన్నే వలచి నన్నే మరచి మురిసేనే కళా
చరణం:2
ఎదుటే లేవని తెలిసినా
నీకోసం ఆరాటం ఆగనిదే
మదిలో రూపమా మెదిలే భావమా
నా పదమందు ఒదిగే భావ కవితా సుందరీ
గమనిక: ఈ గీతం ఆంధ్రజ్యోతి నవకలం శీర్షికలో ప్రచురించబడినది.
రచన
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు
No comments:
Post a Comment