ఓం శ్రీ సాయిరాం
మౌనమై మేలుకొంటున్నా
పల్లవి
విధాతే తలచి రాసినాడో ప్రతిమని చెరిపి గీసినాడో
ప్రభాతం ప్రేరణిస్తున్నా రాత్తిరికి రాలిపోతున్నా
ప్రయత్నం యెంత చేస్తున్నా ప్రయాసే నాకు మిగిలేనా
కాలమే కాలదంతున్నా మౌనమై మేలుకొంటున్నా
|| విధాతే తలచి రాసినాడో ||
చరణం 1
ప్రకృతి గీసిన చిత్రానికి కాలంపూసే వర్ణాలతో
వసివాడినా... వికసించదా
మరణం గెలిచిన తన గుండెలో విరసే పచ్చని రోజిప్పుడు
తలరాతకి... తెలబోయెనా...
మదిలో ఆశలు రేగితే ముసిరే చీకటి కమ్మితే
గెలిచే పిలుపు చేరువకానని పారిపోయేనా
|| విధాతే తలచి రాసినాడో ||
చరణం 2
ఉరిమే ఉప్పెన ప్రళయానికి ఊరువాడ మటుమాయమై
ఒకనాటికి... చిగురించవా...
వెలుగే పడని తన గూటిలో మెరిసే ముత్యపు విలువేమిటో
తనవారికి... తెలిసేదెలా...
కాలం మారే తీరులో గెలుపు ఓటమి పావులై
బళ్ళే ఓడలు ఓడలు బళ్ళై మారిపోయేనా
|| విధాతే తలచి రాసినాడో ||
రచన
చంద్రమౌళి రెడ్లం
పలమనేరు