ఓం శ్రీ సాయిరాం
నిరతము నాలో నిన్నే కొలువైపోనీ
తేది:30-03-2016.
పల్లవి:
మనసున రామ అని మెదిలిన తరంగమే
నిరతము నాలో నిన్నే కొలువైపోనీ
స్వరముల సారం నువ్వే పదముల భావం నువ్వే
హృదయపు వీణను మీటే రాగం నువ్వే
||మనసున||
అను పల్లవి:
ఆ రాగమే నా స్వా సగా ఆడాలి నాలో హంస నాధం
హరి విల్లులో వర్ణాలుగా ఈ మౌనరాగం సాగే నాలో
||మనసున||
చరణం :1
తొలిపొద్దు వికసించు కిరణాలు నీ వల్లే
జగమందు జ్యోతివి నువ్వే
ప్రతి నదిలా పయనించు జీవాత్మ నేనైతే
దరిజేర్చు సంద్రం నువ్వే
ఆ నింగిలో విహరించగా ఈ నేలపై చరియించగా
నివశించు జీవం నీ వల్లేగా
వేకువ నువ్వే వెన్నెల నువ్వే
ఈ భ్రమణ కాలం నీ వల్లేగా
||మనసున||
చరణం :2
తల్లేమొ ప్రకృతిగా తండ్రేమొ పురుషుడిగా
ప్రతి జీవి జనియించగా
జీవితమను బడిలోన ప్రకృతినే పాఠంగా
కాలముతో నేర్పించగా
చిరుదివ్వెలా... ప్రతి జీవిలో...
వెలుగొందు జ్ఞానం నీవల్లేగా
భవబందాలా పెనవేస్తావు చితిమంటతో సెలవంటావు
ఈమాయ లోకం నీవల్లేగా
||మనసున||
గమనిక - ఈ పాట అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక ఏప్రియల్ నెల 2016 సంచికలో ప్రచురించబడినది.
రెడ్లం చంద్రమౌళి
పలమనేరు
Unnatamai na guravamaina atmasakti Prabhavinchu chadrakanti tarala taladannenu.adbhutam rasa Sadhana . Sairam Daivam pogadatarama.
ReplyDeleteThank you sir
ReplyDelete